SDPT: కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి గ్రామ బీరప్ప దేవాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధుల ద్వారా రూ.2 లక్షల వ్యయంతో బోర్ తవ్వించారు. సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.