BDK: పాల్వంచ మండలంలోని శ్రీనివాసగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు.