NGKL: బల్మూరు మండలంలోని పోలిశెట్టిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన పల్లగొర్ల రేణయ్య, గ్రామంలో స్వచ్ఛందంగా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అతడికి శాలువా కప్పి అభినదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.