MNCL: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ లోని కలక్టరేట్ లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.