SRD: కంగ్టిలోని తెలంగాణ గిరిజన సీవోఈ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డీ. విజయ్ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఏప్రిల్ 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.