HNK: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ధరణి, పెన్షన్లు, రేషన్ కార్డులకు సంబంధించిన అర్జీలను వెంటనే పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.