KMM: జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 39 LPG సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రఘునాథపాలెం మీసేవా కేంద్రంలో 32, 2 హోటళ్లలో 7 సిలిండర్లను పట్టుకొని నిర్వాహకులపై 6A కేసు నమోదు చేశారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం నేరమని, అక్రమ నిల్వలపై తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.