BDK: భక్తులకు తాగునీరు, ఇతర సౌకర్యాల్లో ఎలాంటి లోటు రానీయొద్దని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. గురువారం ఆయన స్థానిక మిథిలా స్టేడియంతో పాటు ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేడుకల అనంతరం ప్రసాదం, తలంబ్రాల పంపిణీ సజావుగా సాగేలా చూడాలని సూచించారు.