BHNG: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేట ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈవో చందా రమేష్ అధ్యక్షతన సర్పంచులు, ప్రధానోపాధ్యాయుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు.