MHBD: వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడకుండా పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. తొర్రూరు పట్టణంలో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన 189 మంది బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 1.05 కోట్ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.