BHNG: శాసనమండలి, శాసనసభలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ నర్సింగరావు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ రమణారావులకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం వారికి అభినందనలు తెలిపారు.