MNCL: సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ఏరియాలకు కలిపి మొత్తం రూ.12.60 లక్షలు కేటాయించగా.. ఇందులో మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ.లక్ష చొప్పున, జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు రూ.50 వేలు కేటాయించారు.