MBNR: మదనాపురం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నాగమ్మ గుండె సంబంధ వ్యాధితో హైదరాబాదు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బాధితురాలు చికిత్స కోసం రూ. 2.5 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి చెక్కును నాగమ్మ కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.