KMM: చింతకాని మండలంలో సోమవారం తెల్లవారుజామున బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపుతో కాంగ్రెస్ హామీల అమలుపై చలో అసెంబ్లీ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మండల అధ్యక్షుడు కొండా గోపి, ప్రధాన కార్యదర్శి గోదా మంగయ్యను పోలీసులు ఇంటివద్ద అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.