మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. బాధితుల సమస్యలు స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీసు అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీనివాసరావు వివరించారు.