GDWL: అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ఏప్రిల్ 14 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం పోషకాహార పంపిణీ జరగాలని, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.