NRML: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ప్రవాసి మిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల సూచించారు. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు గల్ఫ్ దేశాలకు వెళ్లకూడదని గురువారం ప్రకటనలు వారు కోరారు.