VKB: పరిగి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ వేలం వచ్చే ఏప్రిల్ 7 మంగళవారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ వెంకటయ్య తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఏప్రిల్ 6న సోమవారం సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రచురితమైన నోటీసును సవరించి తాజా తేదీని ప్రకటించినట్లు తెలిపారు.