KNR: ‘ప్రజా ప్రభుత్వం- ప్రగతి పాలన’లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీహెచ్సీలలో నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రోజుకు ఒక పీహెచ్సీలో గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, ఆప్తోల్మాలజీ, జనరల్ మెడిసిన్, డెంటల్ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.