MHBD: జిల్లాకు చెందిన ఆశ వర్కర్లు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో DMHO రవి రాథోడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.