MHBD: ఏజెన్సీ గిరిజన గూడాల్లో ఆదివాసీ ప్రజలు దోపిడీదారుల చేతిలో బలి పశువులుగా మారుతున్నారని ‘తుడుం దెబ్బ’ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల రాము అన్నారు. ఇవాళ కొత్తగూడలో ఆయన మాట్లాడుతూ.. గంగారం మండలం దుబ్బగూడెంలో స్థానిక ఆదివాసీ రైతులను లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారి ఫర్టిలైజర్ ఎరువులు అమ్మి, అధిక వడ్డీలు వేసి నిలువున దోచుకుంటున్నారని ఆరోపించారు.