SRD: పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో జరిగిన 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవ్వాలని ఆయన పేర్కొన్నారు. పోటీలను పదేళ్లుగా నిర్వహిస్తున్న పండును అభినందించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.