ADB: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకంలో 30% వెయిటేజ్, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగులు దేవదర్శన్, మంజుల, ప్రియాంక, తేజస్వి, కాశీనాథ్, అశ్వక్, తదితరులు పాల్గొన్నారు.