RR: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్/అప్లికేషన్ విభాగంలో అధ్యాపక నియామకం కోసం ఒక పోస్ట్ ఉన్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రాధిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పీజీ సబ్జెక్టులు 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు కళాశాల కార్యాలయం సంప్రదించాలన్నారు.