MHBD: పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన రసాల ఐలయ్య, మేడుదల చెన్నమల్లు, కుందూరు వెంకన్నలు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం వారి స్వగ్రామానికి వెళ్లి మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.