NZB: నిజామాబాద్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐ రఘుపతి తెలిపారు. ఈనెల 7న ఖలీల్వాడిలోని ఓ స్కానింగ్ సెంటర్ ఎదుట పార్కింగ్ చేసిన బైక్ను దుండగులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా.. బోధన్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీల్లో తాటి గొల్ల గోపాల్, అర్బజ్ లనూ పట్టుకున్నట్లు తెలిపారు.