MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీను బాబు మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.