GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచే కాక పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తుంటారని, వారందరికీ ఎల్లప్పుడూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన సూచించారు.