కాంగ్రెస్ పార్టీతో సీపీఎం తెగ దెంపులు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేశారు. రెండు, మూడు రోజుల్లో 17 చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టంచేశారు. ఆ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారు.
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం షురూ చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోడీని ప్రచారంలో వినియోగించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో మోడీ ఈనెల 7, 11 తేదీల్లో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.
బాసర అమ్మవారి ఆలయంలోకి వరసగా పాములు వస్తున్నాయి. విషయం తెలిసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్లే పూజారులు భయపడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు.
బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు..భారతీయ జనతా పార్టీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు. రెండు అభిప్రాయాలు కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమే. అయినా సినిమాల తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదని విజయశాంతి ట్వీట్ చేశారు.
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పేరు చెప్పి పోలీసులు సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీల పేరుతో దొరికిన నగదు దొరికినట్లు సీజ్ చేస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో ఖర్చులకు ఉద్దేశించిందే అన్నట్లు హడావుడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గ టికెట్ దక్కకపోవడం వల్లనే నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఆరోపణలు- ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కల్వకుర్తి విజయభేరి సభలో రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతోందని జనతా కా మూడ్ సర్వే చెప్పింది. ఆ పార్టీ 75 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. తన సెంటిమెంట్ ప్రకారం మూడో సారి రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగ ఫలంతో అధికారం చేపడుతానని భావిస్తున్నారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం BRS, BJP, AIMIM కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కొల్లపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరీ కాంగ్రెస్ సభలో భాగంగా పేర్కొన్నారు. అంతేకాదు అధికార కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.