కాంగ్రెస్ రెండో జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు.
ఖమ్మం జిల్లాలో పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శలు చేయగా ఆయన స్పందించారు. డిపాజిట్ రాని పార్టీని బలోపేతం చేసింది తాను కాదా అని నిలదీశారు.
బిత్తిరి సత్తి మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ను మించిన మెగా హీరో మరెవరు ఉంటారని కామెంట్ చేశారు.
రెండో విడత కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 6 రోజులపాటు బస్సుయాత్ర కొనసాగనుంది.
తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు.. వివిధ అంశాల ఆధారంగా 45 మందికి టికెట్ల కేటాయించింది.
కరీంనగర్ కలెక్టర్, సీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంది.
లోకల్, నాన్ లోకల్ అనే వాళ్లందరికి నేను ఇచ్చే సమాధానం ఒకటే అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓడిపోయి ఇంట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుని పిలిచి మంత్రిని చేశానని.. కానీ ఆయన ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో చేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చంపేటలో చేసిన పలు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిరిగి పార్టీలో చేరాలని.. ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలువాలని కోరారని విశ్వసనీయంగా తెలిసింది.
పది సంవత్సరాల అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాట తప్పని పార్టీ అని, పేదల బతుకులు మారాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
భైంసా పరిస్థితి చూస్తే.. అసలు మనం ఇండియాలో ఉన్నామా అనే సందేహాం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
విపక్ష నేతలు చేస్తోన్న సవాళ్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కేసీఆర్ దమ్మెంటో ఇండియా మొత్తం చూసిందని.. ఇప్పుడు చూడాల్సిది ఏమీ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టంచేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.