మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక.. మొదట అక్కడి మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు.
పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన ఆయన బీఆర్ఎస్లో చేరడం ఖాయమని తెలుస్తుంది. మంత్రి హరీశ్ రావు అతని ఇంటికి వెళ్లి బీఆర్ఎస్లోకి చేరమని ఆహ్వానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించామని, ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని కుదిస్తామని తెలిపింది.
తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ కాళ్లు మొక్కారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చారని పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నికల తరుణంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 19 రోజుల్లో పోలీసులు చేసిన తనిఖీల్లో భాగంగా రూ.377.68 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇక నవంబర్ 30 ఎన్నికల వరకు ఇది డబుల్ అవుతుందో లేదా త్రిబుల్ అవుతుందో చూడాలి మరి.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేసీఆర్పై సవాల్ విసిరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కూడా తెలియని వ్యక్తి దాని గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
విశాఖపట్టణం లోక్ సభ నుంచి పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజల మద్దతు తనకు ఉందన్నారు. పవన్ కల్యాణ్ కన్నా తానే బెటర్ అని ఎంపీ అన్నారని గుర్తుచేశారు.
తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండు చోట్ల ఓటు ఉన్న విషయం గుర్తించే సాప్ట్ వేర్ తమ వద్ద లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ను పార్టీ అజారుద్దీన్కు కేటాయిచింది. దాంతో పార్టీకి రాజీనామా చేయాలని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.