కాంగ్రెస్- సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం ఒక సీటు ఇస్తామని.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పగా.. కమ్యూనిస్ట్ నేతలు అంగీకరించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది.
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బకరా కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా నేతలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి మారతారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటలను ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోతాడని కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్తో పొత్తు లేకుండా 14 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితా విడుదల చేసింది
రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో కేటీఆర్ సందడి చేశారు.
రాష్ట్రంలో కాళేశ్వరంలో ప్రాజెక్టు(kaleshwaram project)లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ల అంశంపై దీనిని నిర్మించిన L&T సంస్థ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన డిజైన, నాణ్యత మేరకు నిర్మించామని..అవసరమైతే దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని, వారి నంబర్ తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అయితే కవిత, కేసీఆర్ పేర్లను ప్రస్తావిస్తు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అన్యాయం కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు, సీబీఐ విచారణ ఎందుకు అదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వందలకోట్ల అవినితీ చేశాడని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఆర్థిక ఉగ్రవాదులని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మైనంపల్లి హన్మంతరావు, రేవంత్ రెడ్డిలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ఓ రౌడీ అని.. రేవంత్ తన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.