అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో నేతలు ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటిస్తున్నారు. ఒక్కో నేత తనకు కారు లేదని పేర్కొన్నారు. వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నానని.. కానీ తన పేరు మీద కార్లు లేవని చెబుతున్నారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తనపై, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతాయని రెండు రోజుల క్రితం పొంగులేటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను ప్రశ్నించారు. మాటలు కాకుండా పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ ప్రజలను కోరారు.
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 150 కోట్ల విలువైన 47 ఎకరాలు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి ఎక్కడుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మంథని టికెట్ కోసం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు మారారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో చివరకు బీఎస్పీలో చేరారు.
శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 16 మందితో మూడో జాబితా విడుదల చేసింది.కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది.