అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో నేతలు ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటిస్తున్నారు. ఒక్కో నేత తనకు కారు లేదని పేర్కొన్నారు. వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నానని.. కానీ తన పేరు మీద కార్లు లేవని చెబుతున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క శిరీష ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. తనపై, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతాయని రెండు రోజుల క్రితం పొంగులేటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. మేడ్చల్ నియోజకవర్గంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ ఈ నెల 20లోగా పూర్తి కావాలని చేయాలని ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్ వి నాయక్ తెలిపారు
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను ప్రశ్నించారు. మాటలు కాకుండా పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ ప్రజలను కోరారు.
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 150 కోట్ల విలువైన 47 ఎకరాలు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి ఎక్కడుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మరో 3 రోజుల్లో తనపై, కుటుంబ సభ్యులపై ఐటీ రైడ్స్ జరగబోతున్నాయని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంథని టికెట్ కోసం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు మారారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో చివరకు బీఎస్పీలో చేరారు.
నల్గొండ నుంచి.. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పదవీ చేపడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇప్పుడే ఏం తనకు తొందర లేదని చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నేతలు కారులో ఎక్కించుకుని వెళ్లారు. బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల అసంతృప్త సెగలు పెరిగాయి.
బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని.. అందుకే ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించామని బీజేపీ సీనియర్ నేత మురళీధర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 16 మందితో మూడో జాబితా విడుదల చేసింది.కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది.
అవినీతి ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మల్కాజిగిరి కోర్టును అజారుద్దీన్ ఆశ్రయించారు. బెయిల్ ఇచ్చిన ధర్మాసనం.. విచారణకు సహకరించాలని స్పష్టంచేసింది.