తెలంగాణ సీఎం కేసీఆర్పై ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాల్లోకి రాకుండా మోడీ, రాహుల్ గాంధీ కలిసి అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
తెలంగాణలో ఇకపై వార్తా సంస్థల్లో రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని సీఈవో స్పష్టంచేశారు. నేతలు, అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డ బాలరాజుకు అచ్చంపేటలో చికిత్స అందజేసి.. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాటే మరిచారని ప్రధాని మోడీ విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు.
బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేత కుమ్మరి వెంకటేశ్ యాదవ్ హామీనిచ్చారు.
సర్పంచ్ నవ్య తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు.
నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. MRPS లేవనెత్తుతున్న డిమాండ్లపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ రాక నేపథ్యంలో ఈ సభకు కీలక బీజేపీ నేతలు హాజరుకానున్నారు.