ఆస్ట్రేలియా ‘A’తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత్-A బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ 150 పరుగులు చేయగా, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 140 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 520/7 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా స్కోరును అధిగమించడానికి మరో 12 పరుగులు మాత్రమే అవసరం.