ఆసియా కప్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొంటున్న 8 జట్ల కెప్టెన్లతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆసియాలోని అత్యుత్తమ జట్లతో తలపడటం ఒక సవాలుగా ఉంటుందని అతడు పేర్కొన్నాడు. ముఖ్యంగా, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.