భారత్-సౌతాఫ్రికా రెండో T20 న్యూ చండీగఢ్లో జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా, ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.