తమిళనాడులో జరుగుతోన్న జూనియర్ హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం సాధించింది. మూడో స్థానం కోసం అర్జెంటీనాతో జరిగిన పోరులో భారత్ 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ టోర్నీ చరిత్రలో భారత్ మెన్స్ జట్టు కాంస్యం సాధించడం ఇదే తొలిసారి. 1997లో రజతం, 2001, 2016లో స్వర్ణం సాధించింది.