ఆసియా కప్లో భాగంగా ఇవాళ ఆఫ్గాన్, హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రేపు యూఏఈతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో భారత జట్టును యూఏఈ ఓపెనర్ అలీషాన్ షరాఫు కొనియాడాడు. భారత జట్టు మొత్తం సూపర్ స్టార్స్తో నిండి ఉందన్నాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటివారు మ్యాచ్ విన్నర్లని చెప్పాడు. వారు ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని పేర్కొన్నాడు.