147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఇంగ్లండ్ బౌలర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. విల్ జాక్స్ (3), జోఫ్రా ఆర్చర్(2) ధాటికి శ్రీలంక కేవలం 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నిస్సాంక (9), మిషారా (6), మెండిస్ (4), రత్నాయకే (0), వెల్లలాగే (10) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం క్రీజులో కమిందు షనక (9), హేమంత(0) పోరాడుతున్నారు.
Tags :