కోల్కతా నైట్రైడర్స్ ప్రాంచైజీతో తనది విడదీయని బంధమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ‘7-8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నేను కోల్కతా జట్టు మెంటార్గా బాధ్యతలు చేపట్టాను. ఆ సీజన్లో కేకేఆర్ మెరుగైన ప్రదర్శన చేసి విజేతగా నిలవడంతో అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఆఫర్ చేశాడు’ అని పేర్కొన్నాడు.