భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ మొదటి దశ టికెట్ల విక్రయం ఈరోజు సాయంత్రం 6:45 గంటల నుంచి మొదలుకానుంది. టికెట్ల కోసం అభిమానులు ICC అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు. టికెట్ ధరలు రూ.100 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్లో ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, ఢిల్లీ, చెన్నై వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.