జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఖరారు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. వారాహి యాత్ర కాదు.. చంద్రబాబు యాత్ర అని పేరు పెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణ భవన్ వద్ద షెజల్ అనే మహిళ సూసైడ్ అటెంప్ట్ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారని తెలిపారు.
అమరవీరుల త్యాగ ఫలితం మన తెలంగాణ. సాంస్కృతిక వారసత్వం, విభిన్న సంస్కృతి తెలంగాణ సొంతం. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. ఏ ఒక్కరితోనే తెలంగాణ ఆవిర్భవించలేదు. అందరూ పోరాడితేనే రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు జేఏసీలో ఉండి మా పార్టీ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర సాధనలో మా పార్టీ గుండెచప్పుడైంది.
లోకేశ్ లక్ష్యంగా దాడి చేసుకుని త్రుటిలో తప్పి భద్రతా సిబ్బందిపై పడింది. ఈ ఘటనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాటి బీడు భూములు నేడు మాగాణాలయ్యాయి.. బోసిపోయిన పల్లెలు మళ్లీ కళకళలాడుతున్నాయి. స్వరాష్ట్రంగా ఏర్పడి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పండుగ వాతావరణం సంతరించుకుంది.
తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతోంది.
కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. దీంతో కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం గుర్రుగా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా మాత్రం శివరాంను వెనకేసుకొని వస్తోంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.
ప్రకాశం జిల్లాలో ఒకరిద్దరు నేతలు ఇబ్బందులు ఉన్నాయని.. ఆ విషయం సీఎం జగన్కు చెప్పానని మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
పొట్ట ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని హోం మంత్రి మహమూద్ అలీని కోరారు మంత్రి మల్లారెడ్డి. ఓ కార్యక్రమంలో పోలీసుల బొజ్జ గురించి మాట్లాడారు.
విన్యాసానికి పోయి ఉన్న పళ్లు రాళ్లగొట్టుకున్నట్టు ఆయన పరిస్థితి తయారైంది. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదేదో ఘనత సాధించినట్లు.. ప్రజలకు ఏదో మేలు జరిగినట్లు కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం సంబరాలు నిర్వహించారు.
ఏపీ, తెలంగాణల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో సర్వే జరగనుంది . ఆరు నెలల్లోపు సర్వే పూర్తిచేయాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
మోహన్ బాబు తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకున్నారు. తిరుమలలో ఏర్పాట్లు బావున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు. తాము తీసే వంద కోట్ల సినిమా గురించి త్వరలోనే మంచు విష్ణు పూర్తి వివరాలు తెలియజేస్తాడన్నారు.