వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడను మరో యాదాద్రి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధి పైన మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో అలాగే అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు సాక్షిగా స్పష్టతను ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతి (Amaravati) అంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటు జరిగిందని గుర్తు చేసింది. అమరావతిని (Amaravati) రాష్ట్ర రాజధానిగ...
వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో ఏపీ ప్రజలను మోసం చేసిన పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని, ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర ప్రజలు సెంటిమెంటుతో కూ...
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. గుండెలో రెండు వాల్ మూసుకుపోయాయని డాక్టర్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడే చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వీరిది కీలకపాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు బడ్జెట్ పద్దుపై చర్చ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం జీఎస్డీపీ పరిమితికి మించి 25 శాతం ఎక్కువ అప్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు చెప్పారు. మరోవైపు కేంద్రం మద్దతు ధర కోసం రాష్ట్రానికి రూ.95 వే...
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై నలుగురు యువకులు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ బాలికకు మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారట. మందుల కోసం మెడికల్ షాపునకు ఆ బాలిక వెళ్లింది. అయితే ఓ మహిళ కనిపించి ఎక్కడికి అని అడిగింది. మందుల కోసం అని చెప్పగా తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పడంతో ఆశ పడి వెళ్లింది. సదరు మహిళ ఆ యువకులకు అప్పగించింది. అప్పటికే వారు గంజాయి మత్తులో ఉన్నారు. గదిలో...
ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు.దేశంలో ఉన్న పీసీసీలు అందరూ రేవంత్ తరహా కా...
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్కు ఆర్టీసీ డ్రైవర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫోటో, వీడియోలు ట్రోల్ అయ్యాయి. అయితే అతనిని విధుల నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. షేక్ హ్యాండ్ ఇస్తే జాబ్ నుంచి తీసేస్తారా అని చర్చ జరిగింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ డ్రైవర్ను ఉద్యోగం నుంచి తీసివేయలేదని స్పష్టంచేసింది. సోషల్ మీడియాలో ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టింది. వారిని గుర్తించి, చట్ట...
ప్రగతి భవన్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాంబులు పెట్టి.. ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాగా…. దీనిలో భాగంగా ఆయన ప్రస్తుతం ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సీఎం కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రవేశం...
ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏపీలో కాక రేపుతోంది. ట్యాపింగ్పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విచారణ జరపాలని అందులో హోం మంత్రి అమిత్ షాను కోరారు. ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత అంశాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొన్నారు. ట్యాపింగ్ చేశారని చెబితే వైసీపీ నేతలు/ ఎమ్మెల్యేలు ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో స్పష్టత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం… అమరావతిని రాజధానిగా ప్రకటించగా… ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా కన్ఫామ్ చేస్తూ… సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఇలాంటి...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10వ తేదీన చెన్నై వెళ్లనున్నారు. ‘2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు’ అనే అంశంపై చర్చలో పాల్గొంటారు. కవితతోపాటు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ హాజరవుతారు. బీఆర్ఎస్ పార్టీ ఎజెండా, దేశాభివృద్దికి కేసీఆర్ ఆలోచనలను కవిత వివరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి త...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జనాల్లోకి వెళుతున్నారు. ఈ రోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తన వర్గీయులతో అన్ని అంశాలపై మాట్లాడారు. పార్టీ నుంచి బయటకు వస్తానని చెబితే ఉలిక్కిపడుతున్నారని కామెంట్ చేశారు. తాను చేసిన తప్పేంటి అని అడిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని నిలదీశారు. నెల్లూరు రూరల్లో పథకాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేక...
హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్కు రుణాల...