ప్రధాని మోడీ జాతీయవాదం ముసుగులో దాక్కున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మోడీ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పారన్నారు. పార్లమెంటులో అదానీ వ్యవహారంపై నరేంద్ర మోడీ మాట్లాడలేదన్నారు.
తెలంగాణకు మోడీ ప్రభుత్వం ధోఖా ఇచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను తూర్పారబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మరో సత్యవతి రాథోడ్ తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
అతి విశ్వాసంతో ముందుకు వెళ్తున్న జగన్ కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని రాజకీయ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈసారి 175కు 175 సీట్లు అంటూ అతి విశ్వాసంతో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారని సమాచారం.
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమేనని బయటకు వచ్చాడు ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ రామశివారెడ్డి.
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే.
అమిత్ షాకి లేఖ రాసిన కోటంరెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగనే స్వయంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.
అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రాజధాని ప్రాంతవాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అమరావతికే మొగ్గు చూపగా సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖను మారుస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఒకటేనని, అది కూడా అమరావతి అని నారా లోకేష్ కుండబద్దలు కొట్టారు. రాజధాని మాత్రమే ఒక్కటి అని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యమని చెప్పారు. సూటిగా కళ్లలోకి చూడలేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
హిండెన్బర్గ్ నివేదిక ప్రకారం అదానీ గ్రూపు షేర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని విపక్షాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.
2004 నుండి 2014 కాలంలో కాంగ్రెస్(Congress) పాలనలో భారత్ అవినీతిమయమైందని, 2జీ స్కామ్ నుండి మొదలు పెడితే కామన్వెల్త్ స్కామ్ వరకు ఎన్నో వెలుగు చూశాయని ప్రధాని నరేంద్ర మోడీ లోకసభలో మండిపడ్డారు.
ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు అందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడను మరో యాదాద్రి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధి పైన మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో అలాగే అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటు సాక్షిగా స్పష్టతను ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని అమరావతి (Amaravati) అంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాతపూర్వక సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5, 6 ప్రకారం రాజధాని ఏర్పాటు జరిగిందని గుర్తు చేసింది. అమరావతిని (Amaravati) రాష్ట్ర రాజధానిగ...
వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేక హోదా పేరుతో గతంలో ఏపీ ప్రజలను మోసం చేసిన పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని, ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర ప్రజలు సెంటిమెంటుతో కూ...
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను నెల్లూరు అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. గుండెలో రెండు వాల్ మూసుకుపోయాయని డాక్టర్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడే చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వీరిది కీలకపాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంచి పలుకుబడి ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ...