మహారాష్ట్రలో ఇప్పటికీ సాగునీరు.. తాగునీరు సమస్య ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో విపక్షాలు ప్రవర్తిస్తోన్న తీరు బాధగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
Ys Viveka హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ ను సీబీఐ కోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం పంపించిన పెండింగ్ బిల్లులకు సంబంధించిన కేసును ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి అంటున్నారు.
ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్పై చేయిచేసుకున్న ఘటనలో వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(Ys Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. రాయల తెలంగాణ అంటూ హడావిడి చేస్తున్నారు.
ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. జేసీ ఇంటి వద్దకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్కు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
విజయమ్మ కూడా సహనం కోల్పోయారు. నన్నే అడ్డుకుంటారా అని మహిళా కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. విజయమ్మ చెంప దెబ్బ వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దాడిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లీ కూతుళ్లు తమపై దాడికి పాల్పడడాన్ని ఖండిస్తున్నారు.
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరం. రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన వాటిని తొలగిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పడం దారుణం.
ఆమె దురుసు ప్రవర్తన.. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడడం వంటి వాటిపై షర్మిలపై పలు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై బాధిత మహిళా కానిస్టేబుల్, ఎస్సై స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సమాచారం. షర్మిల దాడికి పాల్పడడంతో పోలీస్ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆమె రాజకీయం కోసం పోలీసులపై దాడికి పాల్పడడం సరికాదని హితవు పలికాయి.
బీజేపీ ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ‘డీఎంకే ఫైల్స్’ అంటూ స్టాలిన్ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు చేసిన రెండు మూడు రోజులకే ఈ దాడులు చేయడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ నుంచి పూర్వ అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 99లో రెండుసార్లు, మక్తల్ నుంచి 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్ రెడ్డి క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది.
ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్.. లక్ష్యమంటూ లేదు. బూటకపు ఎన్ కౌంటర్లు, నేరస్తులను విడుదల చేయడం వంటివి మాత్రమే మీ ప్రభుత్వం చేస్తుంది