జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శివాజీ నగర్ కు చెందిన చొప్పదండి నరసయ్య (67) ఈనెల 23న మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఇవాళ అతని లివర్, లంగ్స్ దానం చేశారు.
NRML: గ్రామాల్లో శాంతి భద్రతలను అందించేందుకే ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏఎస్పి సాయికిరణ్ తెలిపారు. మంజులాపూర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా 56 బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు.
BDK: గత ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన నిలబడుతూ ఎన్నో పోరాటాలు చేసి నేడు జనజీవన స్రవంతిలో కలవడం సరైన నిర్ణయమని యువతరం పార్టీ నాయకులు కొనియాడారు. లొంగిపోయిన మావోయిస్టులకు యువతరం పార్టీ ఆహ్వానం పలుకుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు.
JGL: జగిత్యాల జిల్లాలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులను గరిష్ఠ స్థాయిలో మంజూరు చేసినట్లు SE బి. సుదర్శనం తెలిపారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 656 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేశామన్నారు.
తూ.గో: ఢిల్లీలో జరిగిన కార్మిక, జౌళీ మరియు నైపుణ్యాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, జౌళీ మంత్రిత్వ శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను కమిటీ పరిశీలించినట్లు తెలిపారు.
TG: గ్రూప్-1,2 ఉద్యోగుల శిక్షణా ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేది.. కోటీశ్వురులు, అధికార దాహం ఉన్నవారు కాదన్నారు. ఆత్మగౌరవం కోసమన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ.. అవమానాన్ని సహించరని అన్నారు.
MDK: మాసాయిపేట మండలం బొమ్మారంకు చెందిన మెట్టెల నాగరాజు (25) ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రైల్వే ట్రాక్ పనులకు వాటర్ సప్లయ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ట్రాక్టర్ ట్యాంకరు బోల్తాపడగా నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.
అన్నమయ్య: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు. టెంపుల్స్ డెవలప్మెంట్ ఫండ్ సహా పలు పథకాల కింద ఇప్పటికే రూ.17 కోట్లు విడుదలైనట్లు, మరో రూ.20 కోట్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ ప్రతిపాదనలకు త్వరిత ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
AKP: మాడుగుల సమీపంలోని తాచేరు నది వద్ద భక్తుల సౌకర్యార్థం మెట్లు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం సర్పంచ్ యడ్ల కళావతి, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి, ఉప సర్పంచ్ జవ్వాది వరహాలు ఈ పనులను ప్రారంభించారు. పంచాయతీ నిధులతో నిర్మిస్తున్న ఈ మెట్ల ద్వారా భక్తులు సులభంగా నదిలోకి వెళ్లి స్నానం చేయగలరని చెప్పారు.
NDL: సుండిపెంట గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వబడలేదని వారు మండిపడ్డారు. కుటుంబాలతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. కార్మికులకు పీఎఫ్, ఈపీఎఫ్, ఆరోగ్య-పని భద్రత వంటి హక్కులు అమలు చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
MDCL: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్ ప్రాంతాలు వస్తాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం తార్నాకలోని HMDA భవనంలో అందుబాటులో ఉంది. కమిషనర్ అధికారి, ఇతర అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. కిందిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే డైరెక్ట్ కమిషనర్ కార్యాలయానికి రావాలన్నారు.
PPM: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎమ్ నియామకం అంటే డబ్బులు లేవని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
నెల్లూరు: చేజర్ల మండలం ఆదురుపల్లిలో గురువారం చేజర్ల ఎస్సై తిరుమలరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు చలానాలు విధించి హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై సూచించారు.
VZM: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి మార్చి 1న ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. ఉషారాణి తెలిపారు. 1న ఆదివారం 5వ తరగతికి ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకూ అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ 12 నుంచి మధ్యాహ్నం 1.30 గంటలు వరకూ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.