• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తొలి వికెట్ కోల్పోయిన భారత్

జింబాబ్వేతో మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.

February 26, 2026 / 07:28 PM IST

IND vs ZIM: తొలి వికెట్ కోల్పోయిన భారత్

జింబాబ్వేతో మ్యాచ్‌లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.

February 26, 2026 / 07:28 PM IST

ధారూర్ బస్టాండ్లో సీసీ పనులు.. ప్రయాణికుల హర్షం

VKB: ధారూర్ మండల కేంద్రంలోని బస్టాండ్‌లో సీసీ ప్లాట్‌పారమ్ పనులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాలు పడితే బస్టాండ్ ఆవరణ అంతా మురుగునీరు, బురదతో నిండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధికార యంత్రాంగం స్పందించి సీసీ పనులు చేపట్టడంతో ఇకపై సౌకర్యంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 07:27 PM IST

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాలకృష్ణ గౌడ్

SRPT: జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హుజూర్ నగర్‌కు చెందిన చెన్నగాని బాలకృష్ణ గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. బీసీల అభ్యున్నతి, సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బీసీల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు.

February 26, 2026 / 07:27 PM IST

‘డ్రైవింగ్ లో నిబంధనలు పాటించాలి’

NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో ‘సురక్షిత ప్రయాణం’పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి, డిపో మేనేజర్ విజయకుమారి పాల్గొని మాట్లాడారు. డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

February 26, 2026 / 07:26 PM IST

ఎస్సీ కాలనీలో భూ ఆక్రమణపై ఉద్రిక్తత

KRNL: చిలకలడోనలోని ఎస్సీ కాలనీలో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఇవాళ కాలనీవాసులు జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. భూమిని సర్వే చేసి పేదలకు పంచిపెట్టడంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించగా కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమిపై సర్వే చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 07:25 PM IST

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

BHPL: రేగొండ మండలం భాగిర్తిపేట గ్రామంలో టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంబాల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని రాష్ట్ర బయటకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు.

February 26, 2026 / 07:25 PM IST

మండపేటలో పాలకేంద్రాలపై విస్తృత తనిఖీలు

E.G: మండపేట పురపాలక సంఘ కమిషనర్ టి.వి.రంగారావు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్రటరీలు మండపేటలోని పాల కేంద్రాలను తనిఖీ చేశారు. మండపేట పట్టణ పరిధిలో ఉన్న 16 పాలకేంద్రాలలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తులు నాణ్యత పరిశీలించి, ఏ విధమైన పాల ఉత్పత్తులు నిల్వ ఉంచరాదని పేర్కొన్నారు.

February 26, 2026 / 07:24 PM IST

మా ప్రభుత్వం తప్పు చేయదు: రేవంత్ రెడ్డి

TG: గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఈ ప్రభుత్వం గ్రూప్ 1,2 ఉద్యోగాలు అమ్ముకుందని కొందరు ప్రచారం చేశారని.. కోర్టుల్లో కేసులు వేశారని వాటన్నింటిని జయించి.. ఇవాళ నియామక పత్రాలు అందించామని అన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేయదని స్పష్టం చేశారు.

February 26, 2026 / 07:23 PM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులను సహించం

NGKL: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించబోమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కుమ్మెర ఘటన బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్‌ జీ.పాటిల్‌తో సమావేశమై కేసు నమోదు ప్రక్రియ, నిందితులపై తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు.

February 26, 2026 / 07:23 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు’

ASR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని టీడీపీ అరకు ఇన్‌ఛార్జ్, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర హెచ్చరించారు. ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి నేతలు స్వప్రయోజనాలకు కాకుండా ప్రజల పక్షాన అధికారుల వద్దకు వస్తారని స్పష్టం చేశారు. వారి సమస్యల పట్ల అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

February 26, 2026 / 07:21 PM IST

సింగరేణి గనిలో రేసింగ్ పావురం

BDK: మణుగూరు సింగరేణి గనిలో ట్యాగ్తో కూడిన ఓ రేసింగ్ పావురం పట్టుబడిన చెన్నై పావురాల రేసింగ్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన పోటీలో భాగంగా దీనిని వదిలారు. గమ్య స్థానానికి వెళ్లే క్రమంలో దాహంతో అది మణుగూరు గనిలో దిగగా, సింగరేణి సిబ్బంది దానిని గుర్తించారు. కాలికి ఉన్న ట్యాగ్ ఆధారంగా అది రేసింగ్ పావురమని గుర్తించారు.

February 26, 2026 / 07:20 PM IST

‘బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం’

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శివాజీ నగర్ కు చెందిన చొప్పదండి నరసయ్య (67) ఈనెల 23న మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఇవాళ అతని లివర్, లంగ్స్ దానం చేశారు.

February 26, 2026 / 07:20 PM IST

మంజులాపూర్‌లో కార్టెన్ సర్చ్

NRML: గ్రామాల్లో శాంతి భద్రతలను అందించేందుకే ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఏఎస్పి సాయికిరణ్ తెలిపారు. మంజులాపూర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా 56 బైకులను సీజ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు.

February 26, 2026 / 07:20 PM IST

నాడు ప్రజల పక్షాన.. నేడు జనజీవన స్రవంతిలోకి

BDK: గత ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన నిలబడుతూ ఎన్నో పోరాటాలు చేసి నేడు జనజీవన స్రవంతిలో కలవడం సరైన నిర్ణయమని యువతరం పార్టీ నాయకులు కొనియాడారు. లొంగిపోయిన మావోయిస్టులకు యువతరం పార్టీ ఆహ్వానం పలుకుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు.

February 26, 2026 / 07:20 PM IST