HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో నాబార్డ్ సహకారంతో నందనం సొసైటీ ఆధ్వర్యంలో రైతుల కోసం డ్రోన్ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా పంటలకు ఎరువులు, పురుగు మందులు సమర్థంగా పిచికారీ చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడం, సమయం ఆదా కావడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
TPT: జిల్లా స్థాయి సెన్సస్ శిక్షణ కార్యక్రమంలో మూడవ రోజు సెన్సస్ ప్రాముఖ్యత, ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించే అవసరం, డిజిటల్ విధానం, కుల సెన్సస్పై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర జనగణన కార్యకలాపాల డైరెక్టర్, పౌర నమోదు డైరెక్టర్ జే. నివాస్, కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గోన్నారు.
SKLM: అమరావతిలోని శాసనసభ ప్రీ విలేజ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ప్రీ విలేజ్ కమిటీ అధ్యక్షులు పి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. శాసనసభ హక్కులు, సభ్యుల బాధ్యతలు, కమిటీ పరిధిలో ఉన్న అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే సిబిల్ స్కోరు పెంచుతామనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ స్కోరు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారు డబ్బు వసూలు చేస్తారు. నిజానికి సిబిల్ స్కోరు మీ ఆర్థిక క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. పాత బాకీలు, ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తేనే స్కోరు పెరుగుతుంది తప్ప, ఎవరూ డబ్బుతో స్కోరును పెంచలేరని గ్రహించి అప్రమత్తంగా ఉండాలి.
KRNL: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామానికి చెందిన వడ్డె రాముడు భార్య వడ్డె సునీతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 30,028 చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని స్పష్టం చేశారు.
GDWL: గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
BHNG: జిల్లా నూతన కలెక్టర్గా నియామకమైన అనురాగ్ జయంతి ఆలేరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల తనిఖీకి చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్, అభివృద్ధికి తోడ్పడుతామన్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో వివిధ కంపెనీలలో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయుటకు గవర్నమెంట్ ఐటిఐ కళాశాల కాకినాడలో ఈనెల 9న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ జిరాక్స్లతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94404-08182 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
E.G: గోపాలపురం నియోజవర్గంలోని పోతవరం నుంచి జి.కొత్తపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నియోజకవర్గ AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాల పాటించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. MLA మద్దిపాటి వెంకటరాజు సహకారంతో రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు.
NRPT: పట్టణంలోని 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు కల్పన, ప్రభాకర్ రాజేష్ ఘట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు గుడ్లు, బాలమృతం, పంపిణీ చేసి గర్భిణిలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.
VSP: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. స్థానిక మస్తరు కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ మేస్త్రీలు, రూట్ సూపర్వైజర్లు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు.
ASR: హుకుంపేట మండలం పట్టంపంచాయతీ నుంచి అమనగిరి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర కూటమి నాయకులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 5కిలోమీటర్ల పొడవుతో రూ.5 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. రోడ్డు లేక ఇన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఆరు గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
నెల్లూరు: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన విజ్ఞప్తులకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కోవూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
ATP: అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ CM చంద్రబాబును కోరారు. ఉండవల్లి నివాసంలో జరిగిన జిల్లా నేతల సమావేశంలో ఆయన ఇవాళ వినతిపత్రం అందజేశారు. నడిమి వంక, మరువ వంక రక్షణ గోడల నిర్మాణం కోసం రూ.79.46 కోట్లు, మున్సిపాలిటీ పెండింగ్ పనులు, శిల్పారామం మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.