• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దేవరకొండలో ఘనంగా టైలర్స్ డే

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో ఉన్న కొంతమంది టైలర్స్ని శాలువాతో సత్కరించి అభినందించారు. టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టైలర్స్‌ను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు.

February 28, 2026 / 12:54 PM IST

రామయ్య నిత్య కళ్యాణం వైభవంగా

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి, విశ్వక్సేన పూజ, కంకణధారణ తదితర కార్యక్రమాల మధ్య అర్చకులు నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

February 28, 2026 / 12:53 PM IST

స్పీకర్ విచారణకు హాజరైన కడియం

TG: రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ స్పీకర్ విచారణకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియం శ్రీహరి తరఫు అడ్వకేట్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామ్ చేయబోతున్నారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై మాత్రమే విచారణ పెండింగ్‍లో ఉంది. ఈ క్రమంలో నిన్నటి విచారణకు దానం గౌర్హాజరు అయ్యారు.

February 28, 2026 / 12:53 PM IST

FLASH: GHMC చట్టం స్థానంలో రానున్న కొత్త కోర్ అర్బన్ చట్టం

HYD: ORR పరిధి మూడు కార్పొరేషన్లకు వర్తించేలా GHMC చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, వాటర్ హార్వెస్టింగ్, చెరువుల అభివృద్ధి పనులను 99 రోజుల కార్యాచరణలో ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు.

February 28, 2026 / 12:50 PM IST

క్లిక్ చేసే ముందు ఆలోచించండి

RR: షాద్ నగర్ పట్టణంలోని కుంటపడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సింబయాసిస్ ఇంటర్‌నేషనల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేయడం మూలంగా నష్టపోవడం తప్ప ఏది ఉండదని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్లిక్ చేసే ముందు ఆలోచించాలని తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: సబ్ కలెక్టర్

KMR: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకాంక్షించారు. జుక్కల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, త్వరలో జరగనున్న వార్షిక పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు.

February 28, 2026 / 12:49 PM IST

MPDOకు డిప్యూటీ సీవోగా పదోన్నతి

RR: మొయినాబాద్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సంధ్యకు పదోన్నతి లభించింది. గత నాలుగేళ్లుగా మొయినాబాద్‌లో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఆమె కృషి, నిబద్ధత, పారదర్శకతకు గుర్తింపుగా డిప్యూటీ సీవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST

ఖండ శాఖల సంగమం విజయవంతం చేయాలి: రాంరెడ్డి

NRPT: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఊట్కూర్ ఖండలో నిర్వహించనున్న ఖండ శాఖల సంగమాన్ని విజయవంతం చేయాలని ఖండ సంఘచాలక్ శ్రీ రాంరెడ్డి కోరారు. ఖండ పరిధిలోని 56 గ్రామాలకు చెందిన స్వయం సేవకులు ఉదయం 7 గంటలకు జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఒకే వేదికపై సమావేశమవుతారని తెలిపారు.

February 28, 2026 / 12:48 PM IST

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేయించుకోవాలి: ఏడీఏ

KMM: పీఎం కిసాన్, కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వర రావు అన్నారు. శనివారం కామేపల్లి మండలంలో మద్దులపల్లి గోవింద్రాల నెమలిపురి గ్రామాల్లో పర్యటించి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణిలో నిలిచిందన్నారు.

February 28, 2026 / 12:48 PM IST

కాకుమానులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: కాకుమానులోని ఇండియన్ స్కూల్ వద్ద ఉన్న బస్టాండ్‌లో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిన వారు వెంటనే కాకుమాను పోలీసులను సంప్రదించాలన్నారు.

February 28, 2026 / 12:47 PM IST

రేవంత్ రెడ్డికి కూల్చడమొక్కటే తెలుసు: ఈటల

TG: వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 కంటే ముందు నుంచి ఉన్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ భూములపై గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందన్నారు. ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కేసీఆర్ వెనక్కి తగ్గారని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చడమొక్కటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తెలిసింది అని ఎద్దేవా చేశారు.

February 28, 2026 / 12:46 PM IST

అంబులెన్స్ వాహనాలు సరిపోక కష్టంగా చివరి మజిలీ..!

HYDలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చివరి మజిలీ చాలా కష్టంగా మారిందని బాధితులు లబోదిబోమంటున్నారు. రోజు దాదాపుగా 50 కి పైగా కేసుల్లో మృతదేహాలకు పైగా పోస్టుమార్టం జరుగుతుంది. కానీ.. మృతదేహాలను తరలించేందుకు సరైన సంఖ్యలో అంబులెన్సులు లేకపోవడంతో, ప్రైవేటు అంబులెన్స్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2026 / 12:46 PM IST

ధైర్య స్పర్శ, సైబర్ నేరాల పై అవగాహన

CTR: ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పూతలపట్టు మండలం అమ్మపల్లి గ్రామంలో ఎస్సై శ్రీ డి.గోపి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధైర్య స్పర్శ, సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నివారణ, రోడ్డు భద్రతా చర్యలు మరియు CCTV ఏర్పాటు యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించారు. గ్రామస్తులు చురుకుగా పాల్గొన్నారు.

February 28, 2026 / 12:46 PM IST

కెప్టెన్‌ను టార్గెట్ చేయడం సిగ్గుచేటు: పాక్ పేసర్

T20 WC-2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆషూపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సల్మాన్ మీర్జా స్పందించాడు. ఒక ఆటగాడు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటాడని, ఏదో ఒక రోజు సరిగా ఆడకపోతే వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నాడు. ఇలాంటివి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు.

February 28, 2026 / 12:46 PM IST

భక్తిశ్రద్ధలతో సనంకరమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

ATP: గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండ గ్రామంలో నూతన సనంకరమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హాజరయ్యారు.

February 28, 2026 / 12:45 PM IST